హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయ్యే పరిస్థితి ఏర్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఎన్టీఆర్ కూడా చేయలేని పనిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు. కాంగ్రెస్ను భూస్థాపితం చేసే శక్తి జగన్కు ఉందని తెలిసే ఈ వేధింపులన్నారు.
రాష్ట్ర విభజనను నిలిపేస్తున్నట్లుగా కేంద్రం బేషరతుగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. అన్నిస్థాయిల్లో సమైఖ్యఉద్యమాన్ని తీసుకెళ్లడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఉద్యమ కార్యాచరణ కోసం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన శుక్రవారం సీజీసీ సమావేశం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కార్యాచరణపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. రేపు అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేల ధర్నా చేస్తారని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు లేఖను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తామని పద్మ చెప్పారు.
రాష్ట్ర విభజనను నిలిపేస్తున్నట్లుగా కేంద్రం బేషరతుగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. అన్నిస్థాయిల్లో సమైఖ్యఉద్యమాన్ని తీసుకెళ్లడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఉద్యమ కార్యాచరణ కోసం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన శుక్రవారం సీజీసీ సమావేశం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కార్యాచరణపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. రేపు అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేల ధర్నా చేస్తారని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు లేఖను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తామని పద్మ చెప్పారు.
0 comments:
Post a Comment