జగన్ పిటిషన్‌పై విచారణ 23కు వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ పిటిషన్‌పై విచారణ 23కు వాయిదా

జగన్ పిటిషన్‌పై విచారణ 23కు వాయిదా

Written By news on Friday, October 18, 2013 | 10/18/2013

జగన్ పిటిషన్‌పై విచారణ 23కు వాయిదా
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు, ఢిల్లీ వెళ్లేందుకు వీలుగా హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది.

ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రావాల్సి ఉన్నా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు సెలవులో ఉండడంతో.. విచారణ వాయిదాపడింది. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు వీలుగా మార్చి 31 వరకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ ఆడిటర్ విజయసాయిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ కూడా 23కు వాయిదా పడింది.
Share this article :

0 comments: