'సమైక్య శంఖారావం' సభకు ఉత్తరాంధ్ర నుంచి 4 ప్రత్యేక రైళ్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'సమైక్య శంఖారావం' సభకు ఉత్తరాంధ్ర నుంచి 4 ప్రత్యేక రైళ్లు

'సమైక్య శంఖారావం' సభకు ఉత్తరాంధ్ర నుంచి 4 ప్రత్యేక రైళ్లు

Written By news on Friday, October 18, 2013 | 10/18/2013

విశాఖపట్నం : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ తో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న 'సమైక్య శంఖారావం' సభకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జనం తరలిరానున్నారు. ఉత్తరాంధ్ర నుంచే ఇప్పటిదాకా నాలుగు ప్రత్యేక రైళ్లను సిద్దం చేసినట్టు వైఎస్ ఆర్ సీపీ నాయకుడు సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు.

ఉత్తరాంధ్ర వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం సమావేశమై సమైక్య శంఖారావం సభ ఏర్పాట్లను సమీక్షించారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో వెళ్లనున్నట్టు రంగారావు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లడానికి రవాణా సదుపాయాలు కల్పించనున్నట్టు చెప్పారు. సమైక్య శంఖారావం సభకు రావడానికి మరిన్ని రైళ్లను ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
Share this article :

0 comments: