సమైక్యవాదులారా.. 'సమైక్య శంఖారావం'కు తరలిరండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్యవాదులారా.. 'సమైక్య శంఖారావం'కు తరలిరండి

సమైక్యవాదులారా.. 'సమైక్య శంఖారావం'కు తరలిరండి

Written By news on Saturday, October 19, 2013 | 10/19/2013

సమైక్యవాదులారా.. 'సమైక్య శంఖారావం'కు తరలిరండి
హైదరాబాద్ : రాజకీయాలకు అతీతంగా సమైక్యవాదులందరూ 'సమైక్య శంఖారావం' సభకు తరలిరావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న 'సమైక్య శంఖారావం' సభ ఏర్పాట్లను పార్టీ నేతలతో కలసి శనివారం పరిశీలించారు.

తెలంగాణలో ఉన్న సమైక్యవాదులు కూడా సభకు తరలిరావాలని ఆమె అన్నారు. ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు హాజరుకావాలని, ఇదే తమ ఆహ్వానంగా భావించాలని శోభా నాగిరెడ్డి కోరారు.
Share this article :

0 comments: