సమైఖ్య శంఖారావంపై పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ చర్చలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైఖ్య శంఖారావంపై పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ చర్చలు

సమైఖ్య శంఖారావంపై పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ చర్చలు

Written By news on Saturday, October 19, 2013 | 10/19/2013

సమైఖ్య శంఖారావంపై పార్టీ  ఎమ్మెల్యేలతో జగన్ చర్చలు
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈనెల 26న జరప తలపెట్టిన సమైక్య శంఖారావం సభపై ఆయన ...పార్టీ నేతలతో చర్చించారు.పార్టీ ఎమ్మెల్యేలతో పాటు..తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీకి హాజరయ్యారు. సభ సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరిపారు. సమైక్య రాష్ట్రం డిమాండ్‌తో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో 26న వైఎస్ఆర్ సీపీ సమైక్య శంఖారావం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

మొదట సభను 28వ తేదీన జరపాలని నిర్ణయించి పోలీసు అనుమతి కోరుతూ వైఎస్సార్సీపీ దరఖాస్తు కూడా చేసింది. అయితే 28వ తేదీ సోమవారం అవుతుందని, ఆ రోజు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 26న కానీ, 27న కానీ జరుపుకుంటే బావుంటుందని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. 27వ తేదీ ఆదివారం రోజు ఎల్బీ స్టేడియాన్ని వేరొకరు ఇప్పటికే రిజర్వ్ చేసుకున్నారు. దాంతో 26వ తేదీ శనివారం సభ నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.
Share this article :

0 comments: