Home »
» రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్మెంట్ కోరిన వైఎస్ జగన్
రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్మెంట్ కోరిన వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. దీనికి సంబంధించి ఆయన గురువారం వారికి లేఖ రూపంలో విజ్క్షప్తి చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి తుపాను బారిన పడ్డ రైతుల సహాయ కార్యక్రమాలపై ప్రధాని, రాష్ట్రపతిలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో విజ్క్షప్తి చేశారు. తుపాను, భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తుపాను బాధితులకు చేపట్టబోయే సహాయ కార్యక్రమాలపై చర్చించేందుకు అనుమతి ఇవ్వాల్సిదింగా లేఖలో తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని హైదరాబాద్ లో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు.
0 comments:
Post a Comment