తణుకు నియోజకవర్గంలోని దువ్వ గ్రామంలో రైతులను పరామర్శిస్తారు. ఇరగవరం మండలం గోతేరు, గొల్లకుంటపాలెం గ్రామాల్లో పంట నష్టాలను పరిశీలిస్తారు. ఆచంట, ఏలేటిపాడు, వేమవరం వరద ప్రాంతాల్లో విజయమ్మ పర్యటిస్తారు. కాగా వరద బాధితులకు అండగా నిలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించినప్పటికి, హైదరాబాద్ నగరం విడిచి వెళ్లరాదని కోర్టు షరతులు విధించింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటించలేకపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయం నిన్న హైదరాబాద్ లో ఓ ప్రకటన విడుదల చేసింది.
కాగా అధిక వర్షాల కారణంగా జిల్లాలో వరిపంటకు తీవ్ర నష్టంవాటిల్లగా పత్తి, వేరుశనగ తదితర పంటలకు నష్టం వాటిల్లింది. వర్షాలు వల్ల జిల్లాలో 635 ఇళ్లు, పంచాయతీ, ఆర్అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నాయని, 4 పశువులు మృతి చెందాయి.
0 comments:
Post a Comment