ఆరువారాల్లో సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారు: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆరువారాల్లో సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారు: జగన్

ఆరువారాల్లో సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారు: జగన్

Written By news on Saturday, October 5, 2013 | 10/05/2013

ఆరువారాల్లో సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారు: జగన్
హైదరాబాద్ : విభజన సమస్యలను ఆరు వారాల్లో మంత్రుల బృందం ఎలా పరిష్కరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రం కోసం ఆయన శనివారం లోటస్ పాండ్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అధికారముంది కదా అని.... కేంద్రం నిరంకుశంగా రాష్ట్రాన్ని విభజిస్తోందన్నారు. విభజనపై అసెంబ్లీ తీర్మాన సంప్రదాయాన్ని గాలికొదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర నిరంకుశ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు జగన్ తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని అంశాలను తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని చెప్పారు.  సమైక్యాంధ్ర కోరుతూ చంద్రబాబు నాయుడు వెంటనే కేంద్రానికి లేఖ ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు.  దీక్షకు ముందే చంద్రబాబు ఆ పనిచేయాలని అన్నారు.  సమైక్యాంధ్ర కోరుతూ చంద్రబాబు ఎందుకు లేఖ ఇవ్వటం లేదో ....మీడియానే ఆయన్ని అడగాలన్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌ విభజన కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలపై అధ్యయనం చేయడానికి మంత్రుల బృందం ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. సరిహద్దుల నిర్ణయం, నదీ జలాలు, ఆస్తుల పంపకం తదితర అంశాలపై ఈ బృందం సిఫారసులు చేయనుంది. పదిమంది మంత్రుల బృందంతో ఏర్పాటు కాగా,  దీనిలో హోం, ఆర్థిక, న్యాయ, జల వనరుల మంత్రులు కూడా ఉంటారు. ఆరు వారాల్లో ఈ బృందం సిఫారసులు సమర్పిస్తుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది
Share this article :

0 comments: