హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్

హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్

Written By news on Wednesday, October 2, 2013 | 10/02/2013


హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ చేరుకున్నారు. కోర్టు అనుమతితో ఇడుపులపాయ వెళ్లి మహానేత సమాధికి నివాళులర్పించిన వైఎస్‌ జగన్‌ అక్కడి నుంచి రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌ వచ్చారు. బుధవారం ఉదయం శంషాబాద్‌ సమీపంలో ఉందానగర్‌ రైల్వేస్టేషన్‌లో ఆయన దిగారు. తల్లి విజయమ్మ, సతీమణి భారతిలు కూడా జగన్‌తో పాటు ఉన్నారు. రైల్వేస్టేషన్‌లో జగన్‌కు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. జై జగన్‌ నినాదాలతో రైల్వేస్టేషన్‌ హోరెత్తింది.
కాగా సుదీర్ఘ విరామం తర్వాత  జగన్‌మోహన్‌రెడ్డి సొంతజిల్లాకు రావడంతో ఆయనను చూసేందుకు జిల్లావాసులు భారీగా ఇడుపాలయకు తరలివచ్చారు. తమ అభిమాననేతను చూసి ఆనందసాగరంలో మునిగిపోయారు. ఇడుపులపాయలోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధిని దర్శించుకునేందుకు సీబీఐ కోర్టు ఒక్కరోజు అనుమతి మంజూరు చేయడంతో జగన్‌ను చూసేందుకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
Share this article :

0 comments: