కృష్ణా జిల్లాలోని ముంపు ప్రాంతాలలో ఆమె పర్యటిస్తున్నారు. జగ్గయ్యపేట మండలం ఆవంచిపల్లి, షేక్ మహమద్ పేట గ్రామాలలో ఆమె పర్యటించారు. వర్షాలకు తడిసిపోయిన పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. వారిని విజయమ్మ పరామర్శించారు.
ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ తడిసిన పత్తి కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు. కౌలు రైతులకు, నష్టపోయిన రైతులకు బ్యాంకు రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణం ఎకరానికి కనీసం పది వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. పంట నష్టం అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత వాస్తవంగా నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు న్యాయం జరిగే విధంగా నష్టపరిహార విధానం రూపొందిస్తామని చెప్పారు. విజయమ్మ రావడంతో బాధితులకు కొంత ధైర్యం చిక్కినట్లయింది.
0 comments:
Post a Comment