సమైక్య శంఖారావం సభకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ నెల 26న జరిగే సభ ఏర్పాట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం పర్యవేక్షించారు. సభా వేదిక నిర్మించే ప్రాంతాన్ని నాయకులు, పోలీసులు పరిశీలించారు. హైదరాబాద్లో గతంలో ఎన్నడూ జరగని రీతిలో సమైక్య శంఖారావం సభను చేపడుతున్నట్టు పార్టీ నేతలు తలశిల రఘురామ్, శివకుమార్ వెల్లడించారు.
మరోవైపు సమైక్య శంఖారావం సభకు ఆంధ్రా విశ్వవిద్యాయలయం విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక బుధవారం సమావేశం నిర్వహించి జగన్ సభకు మద్దతు ప్రకటించింది. సమైక్య భావనతో నిర్వహిస్తున్న శంఖారావం సభను కూడా కొంతమంది రాజకీయ దృష్టితో చూడటంపై విద్యార్ధులు మండిపడ్డారు.
ఇక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్ఆర్ సీపీ తలపెట్టిన సమైక్య శంఖారావానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. సమైక్య శంఖారావానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. సమైక్య రాష్ట్ర సాధనలో సమైక్య శంఖారావం తొలి అడుగుగా ఉద్యోగుల సంఘం అభివర్ణించింది. సమైక్యతను కోరుకునే ప్రతి ఒక్కరు సభకు హజరు కావాలని ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు.
మరోవైపు సమైక్య శంఖారావం సభకు ఆంధ్రా విశ్వవిద్యాయలయం విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక బుధవారం సమావేశం నిర్వహించి జగన్ సభకు మద్దతు ప్రకటించింది. సమైక్య భావనతో నిర్వహిస్తున్న శంఖారావం సభను కూడా కొంతమంది రాజకీయ దృష్టితో చూడటంపై విద్యార్ధులు మండిపడ్డారు.
ఇక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్ఆర్ సీపీ తలపెట్టిన సమైక్య శంఖారావానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. సమైక్య శంఖారావానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. సమైక్య రాష్ట్ర సాధనలో సమైక్య శంఖారావం తొలి అడుగుగా ఉద్యోగుల సంఘం అభివర్ణించింది. సమైక్యతను కోరుకునే ప్రతి ఒక్కరు సభకు హజరు కావాలని ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు.
0 comments:
Post a Comment