రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈనెల 26న జరగనున్న సమైక్య శంఖారావం సభకు భద్రతా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 26వ తేదీన ఎల్ బీ స్టేడియంలో నిర్వహించే ఈ సభకు అంచనాలను మించి అభిమానులు, సమైక్యవాదులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ముందుగానే అప్రమత్తం అవుతున్నారు. ఈ సభను అడ్డుకోడానికి కొందరు తెలంగాణ వాదులు ప్రయత్నిస్తున్నట్లు కూడా సమాచారం అందడంతో పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
16 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు, 34 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు, 1,800 మంది సివిల్ పోలీసులతో పాటు నగరంలోని పలు స్టేషన్లకు చెందిన పోలీసు సిబ్బందిని కూడా భద్రత కోసం ఏర్పాటుచేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాము పూర్తి జాగ్రత్తలు తీసుకుటున్నట్లు ఆయన వివరించారు.
అలాగే సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సమైక్యవాదులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సాగే ఈ సమావేశానికి ముందునుంచే అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసుకుంటున్నారు. ఈ సభ ద్వారా ఢిల్లీ గల్లీల్లో కూడా సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
16 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు, 34 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు, 1,800 మంది సివిల్ పోలీసులతో పాటు నగరంలోని పలు స్టేషన్లకు చెందిన పోలీసు సిబ్బందిని కూడా భద్రత కోసం ఏర్పాటుచేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాము పూర్తి జాగ్రత్తలు తీసుకుటున్నట్లు ఆయన వివరించారు.
అలాగే సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సమైక్యవాదులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సాగే ఈ సమావేశానికి ముందునుంచే అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసుకుంటున్నారు. ఈ సభ ద్వారా ఢిల్లీ గల్లీల్లో కూడా సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
0 comments:
Post a Comment