26వ తేదీ జరుపబోయే ఈ సభలో రాజకీయాలకు అతీతంగా సమైక్య రాష్ట్రం కోరుకునే వారందరూ పాల్గొనాలనేది పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి అభిమతమని, అందువల్ల ఉద్యోగులు సహా అన్ని వర్గాలవారూ పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సభకు ఎంత మంది హాజరవుతారనేది అంచనాలు వేయడం లేదని, కానీ అనూహ్యమైన రీతిలో జన స్పందన ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ మూడు ప్రాంతాల నుంచీ కూడా సమైక్యం కోరుకునే వారు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అన్నారు.
భారీగా ఏర్పాట్లు: భారీగా తరలివచ్చే వారందరికీ పార్టీ తరఫున ఏర్పాట్లు చేస్తున్నామని శోభా నాగిరెడ్డి చెప్పారు. ఆయా జిల్లాల నుంచి వచ్చే వారు ఎక్కడికి రావాలి, వాహనాల పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి వంటి విషయాలకు సంబంధించిన సమాచారం జిల్లా కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని, అక్కడ సంప్రదించాలని కోరారు. అలాగే సమావేశ స్థలికి వచ్చేటపుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాగులు వంటివి తీసుకురావద్దని ఆమె సూచించారు. మొన్నటి వరకూ సుమారు 70 రోజుల పాటు ఉద్యోగులు సమ్మె చేశారని, జీతాలు రాకున్నా చిత్తశుద్ధితో వారు సమైక్యాంధ్ర కోసం పాటుపడ్డారని ఆమె అభినందిస్తూ సభ విజయవంతం కావడానికి ఎన్జీవో సోదరుల సహకారం తీసుకుంటామన్నారు. ఒక రాజకీయ పార్టీగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి జగన్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న ప్రజా సంఘాలు కూడా ఈ సమావేశానికి మద్దతునివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
సభ నిర్వహణపై చర్చలు..
హైదరాబాద్ నగర సంయుక్త కమిషనర్(ఎస్బీ) మల్లారెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ వీబీ కమలాసన్రెడ్డిలు శనివారం ఎల్బీ స్టేడియంకు చేరుకొని సభ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. అనంతరం సమైక్య శంఖారావం సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రాథమికంగా స్టేడియం పరిస్థితిని వివరించారు.
0 comments:
Post a Comment