ఆయన బుధవారం నాడు ఓ టీవీ చానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయంపై పూర్తి స్పష్టతను ఇచ్చారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం తాము అధినేత్రిని కలుస్తామని చెప్పగా, వైఎస్ రాజశేఖరరెడ్డి అందుకు సరేనని తామందరినీ ఢిల్లీ పంపారని, ఆయనకు తాము ప్రత్యేక రాష్ట్రం ఇస్తామన్న విషయాన్ని మాత్రం ముందుగా చెప్పలేదని చిన్నారెడ్డి అంగీకరించారు. అక్కడకు వెళ్లిన తర్వాత మాత్రం తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆకాంక్షను అధినేత్రి వద్ద వ్యక్తం చేసి, ఆ మేరకు ఆమెకు మెమొరాండం ఇచ్చామని తెలిపారు.
తాము ముందుగా చెప్పకుండా తెలంగాణ రాష్ట్రం కావాలంటూ సోనియాగాంధీకి మెమొరాండం ఇచ్చినా.. వైఎస్ మాత్రం తమను ఒక్క మాట కూడా అడగలేదని చిన్నారెడ్డి అన్నారు. ఆయనే తమను పంపారన్న మాట మాత్రం అవాస్తవమని స్పష్టం చేశారు. లేఖ ఇచ్చిన తర్వాత అలా మీరెందుకు ఇచ్చారని అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. దీంతో.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచే, ఆయన నేతృత్వంలోనే తెలంగాణ కావాలంటూ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేశారన్న వాదనలు తేలిపోయాయి!!
sakshi
0 comments:
Post a Comment