అసెంబ్లీని సమావేశపరచాలని రేపు మధ్యాహ్నం గవర్నర్ ను కలవనున్న జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అసెంబ్లీని సమావేశపరచాలని రేపు మధ్యాహ్నం గవర్నర్ ను కలవనున్న జగన్

అసెంబ్లీని సమావేశపరచాలని రేపు మధ్యాహ్నం గవర్నర్ ను కలవనున్న జగన్

Written By news on Wednesday, October 16, 2013 | 10/16/2013


అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్ ను కలవనున్న జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రేపు మధ్యాహ్నం 12.45 గంటలకు గవర్నర్  ఇఎస్ ఎల్  నరసింహన్ ను కలవనున్నారు. శాసనసభను సమావేశపరచాలని ఆయన గవర్నర్ ను కోరతారు. సభలో సమైక్యాంధ్ర తీర్మానం ప్రవేశపెట్టి, ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని విజ్ఞప్తి చేస్తూ ఆయన గవర్నర్ కు ఒక వినతి పత్రం సమర్పిస్తారు.

జగన్ వెంట పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి, అందుబాటులో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు కూడా గవర్నర్ ను కలుస్తారు. సెప్టెంబరు 30న కూడా పార్టీ ముఖ్య నేతలతో కలిసి జగన్ గవర్నర్ ను కలిసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా శాసనసభను సమావేశపరిచి, సమైక్యాంధ్ర తీర్మానం ప్రవేశపెట్టాలని కోరారు.
Share this article :

0 comments: