26,27న గోదావరి జిల్లాలో జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 26,27న గోదావరి జిల్లాలో జగన్ పర్యటన

26,27న గోదావరి జిల్లాలో జగన్ పర్యటన

Written By news on Monday, November 25, 2013 | 11/25/2013

పశ్చిమ గోదావరి జిల్లాలో హెలెన్ తుపాను ప్రభావానికి దారుణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఈ నెల 27న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. 26న తూర్పుగోదావరి జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. అదేరోజు రాత్రి నరసాపురం చేరుకుంటారు. రాత్రి నరసాపురంలో బసచేస్తారు.
27వ తేదీన  వైఎస్ జగన్ పర్యటన  తుపాను ధాటికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి, బాధితులను పరామర్శిస్తారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. ఏడాదిన్నర తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు రానుండడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పై-లీన్, హెలెన్ తుపాను వల్ల సర్వం కోల్పోయిన రైతులు, మత్స్యకారులు, ప్రజలు తమ బాధలు ఆయనకు చెప్పుకోవాలని తహతహలాడుతున్నారు.
Share this article :

0 comments: