సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి నుండి కాకినాడ బయలుదేరుతారు. సాయంత్రం 6 గంటలకు కాకినాడలో మాజీ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ కుమారుని వివాహానికి హాజరవుతారు. రాత్రి 7 గంటలకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ఇంటికి వెళతారు. రాత్రి 8 గంటలకు కాకినాడ నుండి బయలుదేరి హైదరాబాద్ తిరిగి వస్తారు.
వైఎస్ జగన్ పర్యటన సాగేదిలా.....
హైదరాబాద్ నుంచి మధురపూడికి మధ్యాహ్నం 1.45కి జగన్ చేరుకుంటారు. 2.10 గంటలకు మధురపూడి నుంచి బయలుదేరి 2.30 గంటలకు కంబాలచెరువు సెంటర్లో జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పిస్తారు. 3 గంటలకు సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఇంటికి వెళతారు. ఇటీవల వివాహమైన ఆమె కుమార్తె సింధు సహస్రను, అల్లుడు భుజంగరాయుడును అశీర్వదిస్తారు. 4 గంటలకు రాజ మండ్రి నుంచి రాజానగరం ఏడీబీ రోడ్ మీదుగా కాకినాడ వెళతారు.
సాయంత్రం 6 గంటలకు అచ్చంపేట జంక్షన్ ఆశ్రంపాఠశాల రోడ్డులో ఉన్న ద్వారంపూడి భాస్కరరెడ్డి, పద్మావతి కల్యాణ మంటపానికి చేరుకుని పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్, దివ్యశ్రీల వివాహానికి హాజరై నవదంపతులను ఆశీర్వదిస్తారు. రాత్రి ఏడు గంటలకు కాకినాడ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంటికి వెళతారు. 8 గంటలకు ద్వారంపూడి ఇంటి నుంచి బయలుదేరి గౌతమి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వెళతారు.
0 comments:
Post a Comment