వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు వణుకుతున్నాయని ఆ పార్టీ నాయకుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని ఆయన ఆరోపించారు.
భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన నల్గొండ, ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లిన తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అడ్డుకోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తుంటే మాత్రం పూలతో స్వాగతం చెబుతున్నారని భూమన ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి అనడానికి ఇంత కంటే మంచి ఉదహారణ ఏం కావాలని ఆయన ప్రశ్నించారు.
భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన నల్గొండ, ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లిన తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అడ్డుకోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తుంటే మాత్రం పూలతో స్వాగతం చెబుతున్నారని భూమన ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి అనడానికి ఇంత కంటే మంచి ఉదహారణ ఏం కావాలని ఆయన ప్రశ్నించారు.
0 comments:
Post a Comment