మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. భారీగా అనుచరగణం వెంట రాగా శుక్రవారం నాడు పార్టీ కార్యాలయానికి చేరుకుని, సభ్యత్వం తీసుకున్నారు.
జగన్ ను ఇరికించేందుకు తనను పావుగా వాడుకున్నారని, కాంగ్రెస్ పార్టీ తనను ఇరికించిందని ఆయన అన్నారు. జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలంటే ఎవరో ఒక మంత్రిని తప్పనిసరిగా అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో బలహీన వర్గాలకు చెందిన తనను అరెస్టు చేశారని, ఆ పార్టీలో మనుగడ సాగించలేననే ఉద్దేశంతోనే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు.
అనేక సందర్భాల్లో ఈ సమస్యను తాను నాయకుడి దృష్టికి తీసుకెళ్లినా, తాను అరెస్టయిన మరుక్షణమే రమణ అనే వ్యక్తితో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నట్లు వ్యవహరించారని , కష్టకాలంలో తనకెవరూ అండగా నిలబడలేదని పీసీసీ నాయకులు, ముఖ్యమంత్రి, సహచర మంత్రులు వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ ను ఇరికించేందుకు తనను పావుగా వాడుకున్నారని, కాంగ్రెస్ పార్టీ తనను ఇరికించిందని ఆయన అన్నారు. జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలంటే ఎవరో ఒక మంత్రిని తప్పనిసరిగా అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో బలహీన వర్గాలకు చెందిన తనను అరెస్టు చేశారని, ఆ పార్టీలో మనుగడ సాగించలేననే ఉద్దేశంతోనే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు.
అనేక సందర్భాల్లో ఈ సమస్యను తాను నాయకుడి దృష్టికి తీసుకెళ్లినా, తాను అరెస్టయిన మరుక్షణమే రమణ అనే వ్యక్తితో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నట్లు వ్యవహరించారని , కష్టకాలంలో తనకెవరూ అండగా నిలబడలేదని పీసీసీ నాయకులు, ముఖ్యమంత్రి, సహచర మంత్రులు వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment