రేపు కుప్పం నుంచి వైఎస్ జగన్ `సమైక్య శంఖారావం` - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు కుప్పం నుంచి వైఎస్ జగన్ `సమైక్య శంఖారావం`

రేపు కుప్పం నుంచి వైఎస్ జగన్ `సమైక్య శంఖారావం`

Written By news on Saturday, November 30, 2013 | 11/30/2013

రేపు కుప్పం నుంచి వైఎస్ జగన్ `సమైక్య శంఖారావం`
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర చిత్తూరు జిల్లాలో శనివారం నుంచి ప్రారంభంకానుంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ సమైక్య శంఖారావం సభలు నిర్వహించడంతో పాటు వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కూడా జగన్ ఓదారుస్తారు. 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జగన్ కుప్పం నియోజకవర్గంలోని పైపాలెం గ్రామానికి చేరుకుని వెంకటేష్ కుటుంబాన్ని ఓదార్చనున్నారు.

రేపు మద్యాహ్నం ఒంటిగంటకు వెండుగంపల్లె వద్ద వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. అదేరోజు మద్యాహ్నం రెండు గంటల సమయంలో కుప్పంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళి ఆర్పించనున్నారు. ఆ తరువాత కుప్పంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేసి, ఆపై బహిరంగ సభను జగన్ ప్రారంభిస్తారు. రేపు సాయంత్రం బాబానగర్‌, లక్ష్మీపురంలో వైఎస్ జగన్ పర్యాటించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు కంచిబండార్లపల్లెలో లక్ష్మి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ ఓదార్చనున్నారు.
Share this article :

0 comments: