న్యూఢిల్లీ: : దేశ అత్యున్నత పురస్కారమైన 'భారత రత్న'ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ , ప్రముఖ శాస్త్రవేత్త ప్రొ.సీఎన్ ఆర్ రావుకు కేంద్రం ప్రకటించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హార్షం వ్యక్తం చేశారు. సచిన్ , రావులకు ఈ సందర్భంగా జగన్ అభినందనలు తెలిపారు. సచిన్ అసమాన ప్రతిభకు భారతరత్న పురస్కారం ప్రకటించడం ముదావహం అని ఆయన పేర్కొన్నారు.
సచిన్ అంకితభావం యువతకు స్పూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. అలాగే సైన్స్ రంగంలో ప్రొ.రా వు చేసిన సేవలను జగన్ ఈ సందర్బంగా కొనియాడారు. ప్రొ.రావు ప్రస్తుతం ప్రధానమంత్రి శస్త్ర సాంకేతిక సలహదారునిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రొ. రావు పద్మ అవార్డులను కూడా అందుకున్న సంగతి తెలిసిందే.
0 comments:
Post a Comment