జగన్ చెన్నై వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ చెన్నై వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి

జగన్ చెన్నై వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి

Written By news on Monday, November 25, 2013 | 11/25/2013

వైఎస్ జగన్ కు ఊరట
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెన్నై వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక  కోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనకు ఈ అనుమతితో కొంత ఊరట లభించింది. చెన్నై వెళ్లేందుకు వీలుగా తన బెయిలు నిబంధనలు సడలించాలని  కోరుతూ  జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది.

జగన్ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ జాతీయ, ప్రాంతీయ నాయకులను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సహకరించమని కోరుతున్న విషయం తెలిసిందే.  అందులో భాగంగా జగన్ చెన్నై వెళ్లి  ముఖ్యమంత్రి జయలలితను, ఇతర నాయకులను కలుస్తారు.
Share this article :

0 comments: