భాషాప్రయుక్త ప్రాతిపదిక మీద ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్, ఆంధ్ర అసెంబ్లీలు రెండింట మూడొంతుల మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించాయని, నాడు తెలంగాణ బిడ్డ, హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తన పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. తెలుగు ప్రజలు కలిసి ఉండాలని, విశాలాంధ్ర ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ దేశంలో మూడోదని, దేశంలోనే తెలుగు రెండో అతిపెద్ద భాష అయినా.. మమ్మల్ని విడగొట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగింది రేపు బీహార్లో జరగొచ్చు, తమిళనాడులో జరగొచ్చు, లేదా బెంగాల్లో జరగొచ్చని, రాజకీయ లబ్ధి కోసం పార్లమెంటులో 272 సీట్లున్న ఏ ప్రభుత్వమైనా ఒక్క గీత గీసి రాష్ట్రాన్నివిభజించామని చెబుతాయని అన్నారు. ఏపీ విభజనతో కొత్త సంప్రదాయం ఒకటి మొదలవుతోందని, దీన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
0 comments:
Post a Comment