సాక్షి అభయ' అప్లికేషన్‌ ప్రారంభించిన జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాక్షి అభయ' అప్లికేషన్‌ ప్రారంభించిన జగన్

సాక్షి అభయ' అప్లికేషన్‌ ప్రారంభించిన జగన్

Written By news on Tuesday, November 19, 2013 | 11/19/2013





హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ జగన్మోహన రెడ్డి 'సాక్షి అభయ'  ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ ప్రారంభించారు.  ప్రమాదంలో ఉన్న వారి కోసం, ముఖ్యంగా మహిళలు, పిల్లలు కోసం ఈ అప్లికేషన్ రూపొందించారు. ఒక్క క్లిక్ తో ప్రమాదంలో ఉన్న విషయాన్ని పోలీసులకు, తమకు కావలసిన వారికి వెంటనే తెలియజేయవచ్చు.  అపాయంలో ఉన్న వారందరికీ  ఇది ఉపయోగపడుతుంది.

సాక్షి అభయ అప్లికేషన్
ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత కావలసిన ముఖ్యమైన మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి, ఫేస్ బుక్ ఐడిని రిజిస్టర్ చేసుకోవాలి.  ఏదైనా ప్రమాదంలో ఉన్నవారు తమ మొబైల్ హోం స్క్రీన్ పైన 'HELP' అనే బటన్ నొక్కాలి.  జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ద్వారా వెంటనే ప్రమాదంలో ఉన్నవారు ఎక్కడ ఉన్నారో తెలియజేస్తూ సహాయాన్ని కోరుతూ మెసేజ్ వెళుతుంది.

అంతేకాకుండా పది సెకండ్ల వీడియో కూడా మెమరీ కార్డులో రికార్డు అవుతుంది.  వెంటనే దానంతట అదే రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు కాల్ వెళుతుంది.
Share this article :

0 comments: