సమైక్యంగా ఉంచేందుకు మద్దతు ఇవ్వండి: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్యంగా ఉంచేందుకు మద్దతు ఇవ్వండి: జగన్

సమైక్యంగా ఉంచేందుకు మద్దతు ఇవ్వండి: జగన్

Written By news on Sunday, November 17, 2013 | 11/17/2013

సమైక్యంగా ఉంచేందుకు మద్దతు ఇవ్వండి: జగన్
ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమావేశం ముగిసింది. తమ పార్టీ ముఖ్యనేతలతో ఆదివారం సాయంత్రం భేటీ అయిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మద్దతివ్వమని రాజ్ నాథ్ ను కోరారు. ఒకవేళ రాష్ట్రం విడిపోతే తలెత్తె పరిస్థితులపై ఆయనకు జగన్ వివరించారు. గంటన్నర పైగా జరిగిన ఈ చర్చల్లో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితులను రాజ్ నాథ్ కు తెలిపారు.
 
కొన్ని సమస్యలు పరిష్కరించలేనివి  ఉన్నందున రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించమని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి ఐదు పేజీల నివేదికను రాజ్ నాథ్ కు అందజేశారు. రాష్ట్ర సమైక్యతకు బిజెపి ఎందుకు మద్దతు ఇవ్వాలో తెలియజేసే అంశాలు ఆ నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది.
Share this article :

0 comments: