రాష్ట్రవిభజన విషయంలో చంద్రబాబు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రహస్య పుత్రునిలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను విమర్శించే ముందు తమ విధానాన్ని ఏంటో తెలియజేయాలని శోభానాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. టీడీపీ సీనియర్ నేత, శాసన మండలిలో ఆ పార్టీ నేత యనమల రామకృష్ణకు జగన్ ఫోబియా పట్టుకుందని ఆమె పేర్కొన్నారు.
నీకు ధైర్యముంటే మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో సమైక్యమని చెప్పించగలవా అని యనమలను డిమాండ్ చేశారు. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం నుంచి వైఎస్ జగన్ సమైక్య శంఖరావం యాత్ర ప్రారంభిస్తానని ప్రకటించగానే టీడీపీ నేతలకు భయం పట్టుకుందని శోభానాగిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ కుప్పం వస్తే మీకెందుకంత భయం అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. విభజన నిర్ణయం వచ్చిన రోజు సీఎం కిరణ్ తన పదవికి రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అని శోభానాగిరెడ్డి అభిప్రాయపడ్డారు.
0 comments:
Post a Comment