ఇడుపులపాయ చేరుకున్న జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇడుపులపాయ చేరుకున్న జగన్

ఇడుపులపాయ చేరుకున్న జగన్

Written By news on Saturday, November 9, 2013 | 11/09/2013

ఇడుపులపాయ చేరుకున్న జగన్
ఇడుపులపాయ : జననేతకు వైఎస్ఆర్  జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి పులివెందులకు  వచ్చిన వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నీరా'జనం' పలికారు. 20 నెలల సుదీర్ఘ ఎడబాటు అనంతరం జగన్ శనివారం పులివెందులలో అడుగుపెట్టారు. సరిగ్గా 2012 ఫిబ్రవరి 11న రెండురోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇడుపులపాయ, పులివెందులలో గడిపారు. తర్వాత సీబీఐ కేసుల నేపథ్యంలో అరెస్ట్ కావటం.... ఈ ఏడాది సెప్టెంబర్ 24న కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం జగన్ ఈరోజు ఉదయం పులివెందుల విచ్చేశారు. హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో ఎర్రగుంట్లలో దిగి అక్కడ నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. అనంతరం వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించి ఆ తర్వాత పులివెందులకు వస్తారు. ఆదివారం కూడా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారు.
Share this article :

0 comments: