జగన్ నా తమ్ముడి లాంటివారు.. నా బాట సమైక్యమే: మమత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ నా తమ్ముడి లాంటివారు.. నా బాట సమైక్యమే: మమత

జగన్ నా తమ్ముడి లాంటివారు.. నా బాట సమైక్యమే: మమత

Written By news on Wednesday, November 20, 2013 | 11/20/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తమ్ముడి లాంటి వారని, తానెప్పుడూ ప్రాంతాలు సమైక్యంగా ఉండాలనే కోరుకుంటానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నాల్లో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కోల్ కతాలో మమతా బెనర్జీని కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా, రాష్ట్రాలను ఇష్టం వచ్చినట్లు విభజిస్తే కుదరదని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విభజనకు ఒక ప్రాతిపదిక అంటూ ఉండాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ అంతా కలిసే ఉండాలన్నదే తన భావన అని తెలిపారు. కావాలంటే కొన్నిచోట్ల మరిన్ని జిల్లాలు ఏర్పాటుచేసి సమస్యలు పరిష్కరించాలని, అంతేతప్ప విభజిస్తూ పోతే మాత్రం సమస్య పరిష్కారం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
Share this article :

0 comments: