హైదరాబాద్: రేపు జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి కీలక ప్రసంగం చేయనున్నారు. మాసబ్ ట్యాంక్ వద్ద కాజామేన్షన్ ఫంక్షన్ హాల్లో రేపు ఉదయం 9గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో జగన్ ముఖ్యమైన అంశాలు ప్రస్తావించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లి జాతీయ పార్టీల నాయకులను కలిసి సమైక్యవాదానికి మద్దతు ఇవ్వమని కోరుతున్న విషయం తెలిసిందే. సమైక్య ఉద్యమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఇంతకు ముందు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా ముఖ్యనేతలో కలిసి జాతీయ నాయకులను కలిసి తమ ఉద్యమానికి మద్దతు కోరారు. ప్రస్తుతం జగన్ ఢిల్లీలో సమైక్యవాదం వినిపిస్తున్న నేపధ్యంలో విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగం కీలకం కానుంది.
ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చిస్తారు. సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీజీసీ, సీఈసీ సభ్యులు, పార్లమెంట్ పరిశీలకులు, అసెంబ్లీ కో-ఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల రాష్ట్రఅధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధులకు ఆహ్వానం పంపారు.
ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చిస్తారు. సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీజీసీ, సీఈసీ సభ్యులు, పార్లమెంట్ పరిశీలకులు, అసెంబ్లీ కో-ఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల రాష్ట్రఅధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధులకు ఆహ్వానం పంపారు.
0 comments:
Post a Comment