Home »
» రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతికి వైఎస్ జగన్ విజ్ఞప్తి
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతికి వైఎస్ జగన్ విజ్ఞప్తి
హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని రాజ్ భవన్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీలోని సీనియర్ నాయకులు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కూడా విన్నపం చేశారు. రాష్ట్ర విభజనకు ఆధారం ఉండాలని, గతంలో ఆచరించిన విధానాన్నైనా అనుసరించాలని కోరామని, తమ విన్నపాన్ని రాష్ట్రపతి సావధానంగా విన్నారని, వినతిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారుని పార్టీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి తెలిపారు.
రాష్ట్రపతికి రెండు వినతిపత్రాలు ఇచ్చామని, విభజన నిర్ణయం సరైంది కాదని రాష్ట్రపతికి విన్నవించామని, ఎలాంటి కమిటీల ప్రతిపాదనలు లేకుండానే విభజన చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మైసూరారెడ్డి, సోమయాజులు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాజ్యాంగబద్ధ నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశామన్నారు.
ఇక.. రాష్ట్ర విభజన ఆగాలంటే రాష్ట్రపతే దిక్కు అని లక్ష్మీపార్వతి అన్నారు. రాష్ట్రాన్ని అడ్డంగా ఉరేసే నిర్ణయం జరిగిందని, అందువల్ల ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశానని ఆమె తెలిపారు.
0 comments:
Post a Comment