జీఓఎం సమావేశానికి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరారెడ్డిని పంపిస్తామని, సమైక్య వాదాన్ని గట్టిగా వినిపిస్తామని జగన్ స్పష్టం చేశారు. దేశంలో హిందీ తర్వాత రెండవ అతి పెద్ద జాతిగా ఉన్న తెలుగువారం విచ్ఛిన్నమైతే ఎవరూ పట్టించుకునే పరిస్థితి ఉండదన్నారు. రూ.1.75 లక్షల కోట్ల బడ్జెట్తో దేశంలో మూడవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న రాష్ట్రాన్ని విడగొడితే భవిష్యత్తు అంధకారమవుతుందని జగన్ హెచ్చరించారు.
కేంద్రం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోంది. ఓట్లు, సీట్లు మాక్కావాలి.. వాటి కోసం మీ నెత్తిన ఏదో వేసేస్తాం ఆ తరువాత మీ చావు మీరు చావండి అన్నట్టుగా వ్యవహరిస్తోందన్నారు. వారం తిరక్క ముందే విభజనపై నిమిషాల్లో పరిష్కారాలు చూపడం దారుణం అన్నారు. కేంద్ర మంత్రులు రోజుకో నివేదిక, రోజుకో లీక్ చేస్తున్న వైనాన్ని పత్రికల్లో చూస్తూనే ఉన్నామని శ్రీ జగన్ అన్నారు. నీటి విభజనపై కేంద్ర మంత్రి జైరాం రమేశ్ నివేదిక హాస్యాస్పదం అన్నారు. జల వనరుల శాఖ మంత్రి అధ్యక్షతన ఒక మండలి పెడతారట.. దానిలో రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులుంటారట.. రెండు రాష్ట్రాల సెక్రటరీలు కూడా ఉంటారట.. ఆ మండలి కింద బోర్డులు వేస్తారట.. మన రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకంగా మండలి పెడతారట.. దేశంలోని 28 రాష్ట్రాల్లో లేనిది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు మండలి వేస్తారని శ్రీ జగన్ సూటిగా ప్రశ్నించారు.
Johar #YSR.. Jai #Jagan.. Jai #YSRCP.. Jai #Samaikyandhra Like, Share and Spread our Party official page and help in growing the community (https://www.facebook.com/ysrcpofficial)
Johar #YSR.. Jai #Jagan.. Jai #YSRCP.. Jai #Samaikyandhra Like, Share and Spread our Party official page and help in growing the community (https://www.facebook.com/ysrcpofficial)
0 comments:
Post a Comment