కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకుల బోగస్ ఓట్ల దందా బయటపడింది. సాక్ష్యాత్తు డివిజన్ అధ్యక్షుడు నివాసం ఉన్న ఇంటి నంబర్ మీద 102 ఓట్ల్లు నమోదు చేయించి బోగస్ ఓట్లకు రికార్డు సృష్టించాడు. విషయం తెలుసుకున్న ఇతర పార్టీ నాయకులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వాటిని తొలగించేందుకు కసరత్తులు ప్రారంభించారు.
కేపీహెచ్బీ డివిజన్ పరిధిలోని సాయినగర్లో గల ఫ్లాట్ నంబర్ 48 ఇంటి నంబర్ 16-2-153/ఇ లో టీడీపీ డివిజన్ అధ్యక్షుడు నారాయణ రాజు నివాసముంటున్నారు. అదే ఇంటిపై వివిధ ప్రాంతాల్లో ఉంటున్న 102 మందికి ఓటు హక్కు ఉంది. ఓటరు లిస్ట్లో పేర్లను చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓటర్ లిస్ట్లో 367వ పోలింగ్ కేంద్రంలో ఈ ఓట్లు నమోదయ్యాయి. దాంతో మునిసిపల్ అధికారులు ఆ ఇంట్లో తనిఖీలు ప్రారంభించారు.
కేపీహెచ్బీ డివిజన్ పరిధిలోని సాయినగర్లో గల ఫ్లాట్ నంబర్ 48 ఇంటి నంబర్ 16-2-153/ఇ లో టీడీపీ డివిజన్ అధ్యక్షుడు నారాయణ రాజు నివాసముంటున్నారు. అదే ఇంటిపై వివిధ ప్రాంతాల్లో ఉంటున్న 102 మందికి ఓటు హక్కు ఉంది. ఓటరు లిస్ట్లో పేర్లను చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓటర్ లిస్ట్లో 367వ పోలింగ్ కేంద్రంలో ఈ ఓట్లు నమోదయ్యాయి. దాంతో మునిసిపల్ అధికారులు ఆ ఇంట్లో తనిఖీలు ప్రారంభించారు.
0 comments:
Post a Comment