వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో జగన్ భేటీ

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో జగన్ భేటీ

Written By news on Monday, December 16, 2013 | 12/16/2013

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో జగన్ భేటీ
హైదరాబాద్: విభజన బిల్లు రాష్ట్ర శాసనసభకు చేరిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఈ ఉదయం 7 గంటలకు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విభజన బిల్లుపై శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభా వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశం నిర్వహించే అవకాశాలున్న నేపథ్యంతో జగన్ పార్టీ ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు.

కాగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్, టీడీపీల ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా శాసనసభలో సమైక్య తీర్మానం కోసం గట్టిగా పట్టుపట్టాలని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అంతకుముందు పిలుపునిచ్చారు. శాసనసభకు విభజన బిల్లు వచ్చిన తరుణంలో ముందుగా సమైక్య తీర్మానం చేయడం చాలా అవసరమని ఉద్ఘాటించారు.
Share this article :

0 comments: