పులివెందుల: అనంతపురం జిల్లా టిడిపి నేత పేరం నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా చేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమక్షంతో నాగిరెడ్డి పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా జగన్మోహన రెడ్డి మాట్లాడుతూ పేరం నాగిరెడ్డిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానన్నారు. పేరం నాగిరెడ్డి, వి.ఆర్.రామిరెడ్డి కలిసి తాడిపత్రిలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు.
పేరం నాగిరెడ్డికి అనంతపురం జిల్లాలో మంచి పేరుంది. పేరం చేరికతో టిడిపికి తాడిపత్రిలో గట్టి దెబ్బతగిలినట్లుగా భావిస్తున్నారు. తాడిపత్రి నుంచి ఆయన చేరడంతో పలువురు ఈ పార్టీలో చేరే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment