రాష్ట్రపతి ప్రణబ్ తో వైఎస్ జగన్ భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రపతి ప్రణబ్ తో వైఎస్ జగన్ భేటీ

రాష్ట్రపతి ప్రణబ్ తో వైఎస్ జగన్ భేటీ

Written By news on Thursday, December 26, 2013 | 12/26/2013

రాష్ట్రపతి ప్రణబ్ తో వైఎస్ జగన్ భేటీ
హైదరాబాద్ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఉదయం పదకొండున్నర గంటలకు ఆయన  బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ తో సమావేశమయ్యారు  జగన్‌ వెంట వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రపతిని కలిసినవారిలో ఉన్నారు. 
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా రాష్ట్రపతిని కోరారు. గతంలో కూడా జగన్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కాగా ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
Share this article :

0 comments: