పులివెందుల: కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి ఇంటికి లోకేష్ వెళ్లినా ఆయన తండ్రి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రం నోరుమెదపలేదని అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ మాజీ చైర్మన్ పేరం నాగిరెడ్డి విమర్శించారు. టిడిపి సీనియర్ నేత అయిన నాగిరెడ్డి ఈ రోజు వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమక్షంతో పార్టీలో చేరిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర సమైక్యతపై చంద్రబాబు ఇప్పటికీ రెండునాల్కల ధోరణే అవలంభిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తీరు నచ్చకే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. టిడిపిలో తనకు తగిన గుర్తింపు లభించలేదని బాధపడ్డారు. సమైక్యాంధ్ర విషయంలో టిడిపి తీసుకున్న నిర్ణయం చాలా దారునం అన్నారు. రాష్ట్రం చీలితే అభివృద్ది కుంటుపడుతుందన్నారు. సీమాంధ్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్ నిలవడం తనకు నచ్చిందన్నారు.
రాష్ట్ర సమైక్యతపై చంద్రబాబు ఇప్పటికీ రెండునాల్కల ధోరణే అవలంభిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తీరు నచ్చకే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. టిడిపిలో తనకు తగిన గుర్తింపు లభించలేదని బాధపడ్డారు. సమైక్యాంధ్ర విషయంలో టిడిపి తీసుకున్న నిర్ణయం చాలా దారునం అన్నారు. రాష్ట్రం చీలితే అభివృద్ది కుంటుపడుతుందన్నారు. సీమాంధ్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్ నిలవడం తనకు నచ్చిందన్నారు.
0 comments:
Post a Comment