అవిశ్వాసం పెట్టడం అనేది తెలుగు ప్రజల నిరసనకు నిదర్శనమని, సమైక్య ఆంధ్రప్రదేశ్ మినహా మరోటి మాకు అంగీకారం కాదని వైఎస్ జగన్ అన్నారు. సొంత పార్టీ ఎంపీలు అవిశ్వాసం పెట్టారంటే సోనియా తమ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశారో అర్థమవుతుందని ఆయన అన్నారు. అసెంబ్లీలో కూడా విభజన బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. 70 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలొస్తాయని అందరికీ తెలుసని, అయినా అవిశ్వాసం పెట్టామంటే అది తమ ఆవేదనకు నిదర్శనమని వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా సోనియాపైనా, ప్రభుత్వంపైనా వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నామని ఆయన అన్నారు.
ఇక అవిశ్వాసం విషయంలో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. టీడీపీలో సొంత పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా అవిశ్వాసానికి మద్దతు పలకలేదని, అసలు ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు పార్లమెంటులోనే లేరని విమర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా లేఖ ఇవ్వమంటే చంద్రబాబు ఇవ్వలేదని, అలాగే అవిశ్వాసానికి మద్దతు చెబుతామంటూ పార్టీ తరఫున అధికారికంగా కూడా లేఖ ఇవ్వలేదని జగన్ అన్నారు. కానీ తాను దానిపై వ్యాఖ్యానించబోనని, ఆ పార్టీ సభ్యులంతా అవిశ్వాసాన్ని బలపరచాలని సూచించారు.
0 comments:
Post a Comment