బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కారకుడు కిరణే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కారకుడు కిరణే

బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కారకుడు కిరణే

Written By news on Monday, December 16, 2013 | 12/16/2013

'బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కారకుడు కిరణే'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్:రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ప్రధాన కారకుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డేనని వైఎస్సార్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అసలు తెలంగాణ బిల్లు ఇక్కడ వరకూ రావడానికి కారణ మాత్రం సీఎం అనే విషయం అందరికీ అవగతం అయ్యిందన్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ చర్చించే అంశాన్ని అడ్డుకున్న అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సీఎంగా ఉన్న కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులే విభజన ద్రోహులని భూమన మండిపడ్డారు. సీమాంధ్రులు గొంతు కోసేలా విభజన బిల్లు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న డ్రామను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రక్తి కట్టిస్తున్నారన్నారు.
 
అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరయ్యారని భూమన తెలిపారు. ఇంతటి కీలకమైన బిల్లు అంశాన్ని డిప్యూటీ స్పీకర్ తో చర్చకు అనుమతి ఇప్పించడం హేయమైన చర్యని అన్నారు.
Share this article :

0 comments: