విభజనకు సంబంధించిన కీలక బిల్లులు రాష్ట్రపతి ద్వారానే వెళ్తాయనే విషయం తెలిసి కూడా చంద్రబాబు ఎందుకు మిన్నకుండిపోయారన్నారు. ఈ మేరకు సుచరిత ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి తనకు అపాయింట్మెంట్ ఇవ్వడంలేదంటూ ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసిన చంద్రబాబు, ఆదివారం సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేల వెంట ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
రాష్ట్ర సమైక్యతపై చంద్రబాబు అభిప్రాయాన్ని చెప్పాలని ప్రణబ్ అడిగితే తన భండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే రాష్ట్రపతిని కలవకుండా ఆయన ముఖం చాటేశారని సుచరిత ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా రెండు నాల్కల ధోరణి విడనాడి, విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని, లేకపోతే ప్రజల చేతిలో ఆ పార్టీకి, ప్రజాప్రతినిధులకు గుణపాఠం తప్పదని ఆమె హెచ్చరించారు.
0 comments:
Post a Comment