మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,అనంతపురం జిల్లా తాడిపత్రి కాంగ్రెస్ శాసనసభ్యుడు జెసి దివాకర రెడ్డి నిన్న,ఈరోజు చేసిన వ్యాఖ్యలపై రాష్టమంతటా చర్చ జరుగుతోంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఇంతకు ముందు ఎవరూ విమర్శించని స్థాయిలో ఆ పార్టీ అధినేత సోనియా గాంధీని కూడా విమర్శించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం చెందినందున సోనియా గాంధీ పార్టీ నాయకత్వం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె తప్పుకుని యువకులకు అవకాశం ఇవ్వాలని కూడా జేసీ సూచించారు. రాష్ట్రంలో ఆ పార్టీకి బతుకేలేదని చెప్పారు. రాష్ట్రంలోనేకాదు దేశంలో కూడా కాంగ్రెస్ చచ్చిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం కావాలని చెప్పారు. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయాలంటే ముందు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి కేంద్ర మంత్రులు, ఎంపిలను ముందు సస్పెండ్ చేయాలని ఆయన అన్నారు.
అంతకంటే ముఖ్యమైన వ్యాఖ్యలు ఆయన కొన్ని చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీని ఊడ్చేశాడని, రాష్ట్రంలో కూడా మరో కేజ్రీవాల్ పుట్టుకువస్తాడని చెప్పారు. అంతేకాకుండా, 40 ఏళ్ల వయసున్న కొత్తనేత రానున్నాడన్నారు. ఆ నేత పేరు మాత్రం జెసి చెప్పలేదు. ఆ నేత ఎవరనేదానిపై అందరూ చర్చించుకుంటున్నారు. ఆ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి అయి ఉంటారని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఆయన చెప్పిన వయసుకు దగ్గరగా ఉన్నది అతనే. ప్రస్తుతం అత్యధిక ప్రజాదరణ పొందుతూ ఎదిగిపోతున్న నేత జగన్. జన నేతగా ఎదిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఊడ్చేయడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపధ్యంలో రాష్ట్రంలోనే కాకుండా, దేశంలో కూడా దూసుకుపోతున్న నేత జగన్మోహన రెడ్డి. అందువల్ల జెసి దివాకర రెడ్డి చెబుతున్న నేత జగనే అయి ఉంటారని చర్చించుకుంటున్నారు
అంతకంటే ముఖ్యమైన వ్యాఖ్యలు ఆయన కొన్ని చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీని ఊడ్చేశాడని, రాష్ట్రంలో కూడా మరో కేజ్రీవాల్ పుట్టుకువస్తాడని చెప్పారు. అంతేకాకుండా, 40 ఏళ్ల వయసున్న కొత్తనేత రానున్నాడన్నారు. ఆ నేత పేరు మాత్రం జెసి చెప్పలేదు. ఆ నేత ఎవరనేదానిపై అందరూ చర్చించుకుంటున్నారు. ఆ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి అయి ఉంటారని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఆయన చెప్పిన వయసుకు దగ్గరగా ఉన్నది అతనే. ప్రస్తుతం అత్యధిక ప్రజాదరణ పొందుతూ ఎదిగిపోతున్న నేత జగన్. జన నేతగా ఎదిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఊడ్చేయడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపధ్యంలో రాష్ట్రంలోనే కాకుండా, దేశంలో కూడా దూసుకుపోతున్న నేత జగన్మోహన రెడ్డి. అందువల్ల జెసి దివాకర రెడ్డి చెబుతున్న నేత జగనే అయి ఉంటారని చర్చించుకుంటున్నారు
0 comments:
Post a Comment