కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పుకు చంద్రబాబు విధానాలే కారణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పుకు చంద్రబాబు విధానాలే కారణం

కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పుకు చంద్రబాబు విధానాలే కారణం

Written By news on Sunday, December 1, 2013 | 12/01/2013

'కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పుకు చంద్రబాబు విధానాలే కారణం'
హైదరాబాద్: కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విధానాలే కారణమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. బాబు ఆరోజు ప్రాజెక్టులను నిర్మించి ఉంటే ఇవాళ ట్రైబ్యునల్‌ కేటాయింపులు ఇచ్చే అవకాశం ఉండేది కాదని ఆయన తెలిపారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్ట్‌లను చంద్రబాబు అడ్డుకోకుండా చోద్యం చూడటం వల్లే ఈ రోజు దుస్థితి వచ్చిందన్నారు. ఎన్టీఆర్‌ ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను కూడా మూలన పడేసిన ఘనత బాబుకే దక్కుతుందని గట్టు ఎద్దేవా చేశారు.
 
బాబు ప్రాజెక్ట్‌లు కోసం రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తే... వైఎస్‌ఆర్‌ రూ.50వేల కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు జనాన్ని తలుపులు మూసుకోమంటే.. జనం ఆయన్ని నోరు మూసుకోమని సమాధానం ఇచ్చారన్నారు.
Share this article :

0 comments: