చెన్నై: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సాయంత్రం గోపాలపురంలోని డీఎంకే అధినేత కరుణానిధి నివాసంలో ఆయనను కలిశారు. జగన్ ఆ ఇంటికి వెళ్లగానే కరుణానిధి కుమారుడు స్టాలిన్, కుమార్తె కనిమొళి బయటకు వచ్చి స్వాగతం పలికారు. స్టాలిన్ జగన్ కు శాలువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు.
అంతకు ముందు జగన్ అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు. కరుణానిధిని కూడా జగన్ సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని కోరతారు.
అంతకు ముందు జగన్ అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు. కరుణానిధిని కూడా జగన్ సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని కోరతారు.
0 comments:
Post a Comment