చిన్న రాష్ట్రాలకు సమాజ్ వాదీ పార్టీ వ్యతిరేకం అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు తాము పూర్తిగా వ్యతిరేకం అని అఖిలేష్ తెలిపారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టే తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తాం అని ఆయన అన్నారు.
యూపీ నుంచి ఉత్తరాంచల్ విడిపోయినా ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. చిన్న రాష్ట్రాలతో సమస్యలు పరిష్కారం కావు ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సుదీర్ఘ అనుబంధం ఉంది అని.. రాజకీయాలకు అతీతంగా మా స్నేహం కొనసాగుతుంది అఖిలేష్ అన్నారు.
0 comments:
Post a Comment