విభజనపై సుప్రీంకోర్టులో రఘురాజు పిటిషన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విభజనపై సుప్రీంకోర్టులో రఘురాజు పిటిషన్

విభజనపై సుప్రీంకోర్టులో రఘురాజు పిటిషన్

Written By news on Wednesday, December 11, 2013 | 12/11/2013

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ దేశ రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆయన బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రాల హక్కులను హరించారంటూ రఘురాజు తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఉమ్మడి రాజధాని అంశం రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదని .... 371 (డి) రెండు రాష్ట్రాలకు ఎలా అమలు చేస్తారని ఆయన తన పిటిషన్ లో కేంద్రాన్ని ప్రశ్నించారు.
Share this article :

0 comments: