బంద్ ను పొడిగించిన వైఎస్సార్ సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బంద్ ను పొడిగించిన వైఎస్సార్ సీపీ

బంద్ ను పొడిగించిన వైఎస్సార్ సీపీ

Written By news on Friday, December 6, 2013 | 12/06/2013

బంద్ ను పొడిగించిన వైఎస్సార్ సీపీవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజించాలని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా చేపట్టిన బంద్ ను రేపటి్కి వరకు పొడిగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రజల ఆకాంక్ష మేరకు రేపు కూడా బంద్ కు వైఎస్ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. జగన్ పిలుపు మేరకు నేడు నిర్వహించిన బంద్ విజయవంతమయింది.
 
 విభజన వల్ల నష్టపోయే ప్రాంత ప్రజలంతా మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్ ను విజయవంతం చేశారు. ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. విభజన ప్రక్రియను ఆపేవరకు తమ పోరాటం ఆపేది లేదని నాయకులు, ప్రజలు స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీలు నాయకులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే ఊరుకోబోమని ఆందోళనకారులు హెచ్చరించారు.
Share this article :

0 comments: