టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణపై అనుసరిస్తున్న వైఖరిని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
తమ పార్టీకి ముగ్గురే ఎమ్.పిలే ఉన్నా, తామంతా పార్లమెంటుకు వెళ్లి ఒకే స్టాండ్ మీద ఉన్నామని,పార్టీ అధ్యక్షుడిని అయినా తాను కూడా స్పీకర్ వెల్ లోకి వెళ్లామని జగన్ అన్నారు.అవిశ్వాస తీర్మానం, వాయిదా తీర్మానాల రూపంలో దేశం మొత్తం తెలిసే విదంగా రోజూ అడ్డుకున్నామని జగన్ అన్నారు.సమాజవాది పార్టీ, శివసేన వంటి పార్టీలతో వాయిదా తీర్మానాలు ఇప్పించామని ఆయన చెప్పారు.చంద్రబాబు నలుగురు ఎమ్పిలను ఒకవైపు , ఇద్దరు ఎమ్.పిలను మరో వైపు పెట్టారని, చివరి రోజు చంద్రబాబుకు చెందిన నలుగురు ఎమ్.పిలు , కాంగ్రెస్ ఎమ్.పిలు నలుగురైదుగురు వెల్ లోకి వెళ్లామని ఆయన తెలిపారు.అదే సమయంలో టిడిపి ఎమ్.పిలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాధోడ్ లు వెల్ లోకి వెళ్లేవారిని తిడుతూ ఉన్నారని ఆయన అన్నారు. మన రాష్ట్రం నుంచే ఒకవైఖరి లేకుండా వ్యవహరిస్తున్న తీరు చూసి స్పీకర్ మీరాకుమార్ , అసదుద్దీన్ ఒవైసీ నవ్వారని జగన్ ఎద్దేవ చేశారు.శాసనసభలో సైతం టిడిపి ఇలాగే చేస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు శాసనసభకు వెళ్లినా ఛాంబర్ లోనే కూర్చుంటున్నారని ఆయన అన్నారు.ఇరువైపులా వాదించుకోమని చెబుతున్నారని, అందరికి ఒకేచోట నుంచి ప్లకార్డులు రాసి పంపించారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా పధకం ప్రకారం కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారని జగన్ ఆరోపించారు. తెలంగాణ బిల్లుపై ఆయన సంతకం చేశారని,ఆయన అదికార్లతో సంతకాలు చేయించారని ఆయన అన్నారు.ఈ ఎమ్మెల్యేలు అంతా మనస్పూర్తి సాక్షిగా అడుగులు వేయాలని జగన్ పిలుపు ఇచ్చారు.
తమ పార్టీకి ముగ్గురే ఎమ్.పిలే ఉన్నా, తామంతా పార్లమెంటుకు వెళ్లి ఒకే స్టాండ్ మీద ఉన్నామని,పార్టీ అధ్యక్షుడిని అయినా తాను కూడా స్పీకర్ వెల్ లోకి వెళ్లామని జగన్ అన్నారు.అవిశ్వాస తీర్మానం, వాయిదా తీర్మానాల రూపంలో దేశం మొత్తం తెలిసే విదంగా రోజూ అడ్డుకున్నామని జగన్ అన్నారు.సమాజవాది పార్టీ, శివసేన వంటి పార్టీలతో వాయిదా తీర్మానాలు ఇప్పించామని ఆయన చెప్పారు.చంద్రబాబు నలుగురు ఎమ్పిలను ఒకవైపు , ఇద్దరు ఎమ్.పిలను మరో వైపు పెట్టారని, చివరి రోజు చంద్రబాబుకు చెందిన నలుగురు ఎమ్.పిలు , కాంగ్రెస్ ఎమ్.పిలు నలుగురైదుగురు వెల్ లోకి వెళ్లామని ఆయన తెలిపారు.అదే సమయంలో టిడిపి ఎమ్.పిలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాధోడ్ లు వెల్ లోకి వెళ్లేవారిని తిడుతూ ఉన్నారని ఆయన అన్నారు. మన రాష్ట్రం నుంచే ఒకవైఖరి లేకుండా వ్యవహరిస్తున్న తీరు చూసి స్పీకర్ మీరాకుమార్ , అసదుద్దీన్ ఒవైసీ నవ్వారని జగన్ ఎద్దేవ చేశారు.శాసనసభలో సైతం టిడిపి ఇలాగే చేస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు శాసనసభకు వెళ్లినా ఛాంబర్ లోనే కూర్చుంటున్నారని ఆయన అన్నారు.ఇరువైపులా వాదించుకోమని చెబుతున్నారని, అందరికి ఒకేచోట నుంచి ప్లకార్డులు రాసి పంపించారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా పధకం ప్రకారం కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారని జగన్ ఆరోపించారు. తెలంగాణ బిల్లుపై ఆయన సంతకం చేశారని,ఆయన అదికార్లతో సంతకాలు చేయించారని ఆయన అన్నారు.ఈ ఎమ్మెల్యేలు అంతా మనస్పూర్తి సాక్షిగా అడుగులు వేయాలని జగన్ పిలుపు ఇచ్చారు.
kommineni
0 comments:
Post a Comment