హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం(సిఇసి) సీలింగ్ ఫ్యాన్ ను కామన్ గుర్తుగా కేటాయించింది. రాష్ట్రంలోని 294 శాసనసభ, 42 లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసే పార్టీ అభ్యర్థులకు సీలింగ్ ఫ్యాన్ కామన్ గుర్తుగా ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం పంపిన ఉత్తర్వులు పార్టీ కార్యాలయానికి అందాయి.
పార్టీ లోక్ సభ, శాసనసభ సభ్యులు గత ఉప ఎన్నికల్లో ఈ గుర్తుపైనే గెలిచారు. అదే సీలింగ్ ఫ్యాన్ ను కేంద్ర ఎన్నికల సంఘం తమ పార్టీకి కేటాయించడం పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీలింగ్ ఫ్యాన్ గుర్తును రాష్ట్రంలో ఎవరికీ కేటాయించరు.
పార్టీ లోక్ సభ, శాసనసభ సభ్యులు గత ఉప ఎన్నికల్లో ఈ గుర్తుపైనే గెలిచారు. అదే సీలింగ్ ఫ్యాన్ ను కేంద్ర ఎన్నికల సంఘం తమ పార్టీకి కేటాయించడం పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీలింగ్ ఫ్యాన్ గుర్తును రాష్ట్రంలో ఎవరికీ కేటాయించరు.
0 comments:
Post a Comment