Home »
» జగన్ సమైక్య ఉద్యమానికి బాసట
జగన్ సమైక్య ఉద్యమానికి బాసట
హైదరాబాద్, న్యూస్లైన్: వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ స్వాతంత్య్ర సమరయోధుల సంస్థ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జగన్ సమైక్య ఉద్యమానికి బాసట గా ఉంటామని సోమవారం సమరయోధుల సంస్థ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసిందని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు నర్రా మాధవరావు తెలిపారు. నాటి స్వాతంత్య్రోద్యమకారులు బూర్గుల రామకృష్ణారావు, వల్లూరి బసవరాజు, తెలంగాణ స్వాతంత్య్ర పోరాటయోధులు రావి నారాయణరెడ్డి, బద్ధం ఎల్లారెడ్డి త దితరులు తెలుగు ప్రజలను ఒక్కటి చేయడానికి విశాలాంధ్ర ఉద్యమం పేరుతో ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం తెలుగు ప్రజల్ని, తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని విమర్శించారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా... తెలుగు ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్న జగన్మోహన్రెడ్డి అభినందనీయుడని నర్రా మాధవరావు కొనియాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టేదికాదని ఆయన విచారం వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment