కిరణ్, చంద్రబాబు రాష్ట్ర విభజన ద్రోహులు: రోజా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కిరణ్, చంద్రబాబు రాష్ట్ర విభజన ద్రోహులు: రోజా

కిరణ్, చంద్రబాబు రాష్ట్ర విభజన ద్రోహులు: రోజా

Written By news on Wednesday, December 11, 2013 | 12/11/2013

కిరణ్, చంద్రబాబు రాష్ట్ర విభజన ద్రోహులు: రోజా
తిరుపతి: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులు రాష్ట్ర విభజన ద్రోహులంటూ వైఎస్ఆర్ సీపీ నేత రోజా తీవ్రంగా ధ్వజమెత్తారు. తిరుపతిలోని నగరిలో రోజా నేతృత్వంలో  బుధవారం రైతుల ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆమె  కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులను విమర్శించారు.  కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులు తెరవెనుక సమైక్యవాదాన్ని వినిపిస్తూ వీరిద్దరూ యూపీఎ ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తున్నారని రోజా మండిపడ్డారు.

అయితే సమైక్యం కోసం వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని రోజా చెప్పారు. జగన్ ఇప్పటికే చాలా పార్టీల మద్దతు కూడగట్టుకున్నారని ఆమె అన్నారు. సమైక్య రాష్ట్రం జగన్ వల్లే సాధ్యమని రోజా స్పష్టం చేశారు.
Share this article :

0 comments: