Home »
» జగన్ పోరాటాన్ని అభినందించిన జేసీ
జగన్ పోరాటాన్ని అభినందించిన జేసీ
జేసీ దివాకర్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీకి ఓ కన్ను ఇప్పటికే పోయింది
- చంద్రబాబుకు రెండుకళ్లూ పోయే ప్రమాదముంది
- ఇలాంటి సభను ఎప్పుడూ చూడలేదు
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాన్ని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అభినందించారు. ఆయనను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని తెలిపారు. ఇప్పటికైనా అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని ఆయన గురువారమిక్కడ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనపై రెండుకళ్ల సిద్ధాంతంతో ముందుకు పోతున్న చంద్రబాబు నాయుడుకు రెండు కళ్లుపోయే ప్రమాదం ఉందన్నారు. అథఃపాతాళానికి పోయే ప్రమాదముంది. ఇప్పటికే కాంగ్రెస్ ఓ కన్నును కోల్పోయిందని జేసీ వ్యాఖ్యానించారు. మిగిలిన ఒక్క కన్ను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే.
0 comments:
Post a Comment